'లోకేష్' ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్, విషమంగా యువ కార్యకర్త పరిస్థితి
కరెంట్ షాక్ తో గాయపడిన యువ కార్యకర్తను అనిల్ కుమార్ గా గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
కాకినాడ: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాలో తన తొలి అధికారిక పర్యటన చేయనున్నారు. అధికారులు ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది.
కాకినాడ టౌన్ లో లోకేష్ కు స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు కడుతున్న సమయంలో టీడీపీ కార్యకర్త ఒకరికి కరెంట్ షాక్ తగిలింది. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఓ కరెంటు స్తంభానికి ఫ్లెక్సీ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి గాయపడినట్లు తెలుస్తోంది.

కరెంట్ షాక్ తో గాయపడిన యువ కార్యకర్తను అనిల్ కుమార్ గా గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. నారా లోకేష్ తొలి అధికారిక పర్యటనలో విషాదం చోటు చేసుకోవడం కార్యకర్తలను కొంత ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications