ఢిల్లీలో ఏపీ కొట్లాట: టిడిపి వాయిదా తీర్మానం, వైసీపీ ధర్నా, ప్రధానిపై కాంగ్రెస్ ఫిర్యాదు
Recommended Video

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ, ఇంకోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపీని టార్గెట్ చేశాయి. టీడీపీ ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం ఇచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆందోళనకు దిగింది.

సమావేశాలకు ముందు టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎంపీ శివప్రసాద్ కృష్ణుడి వేషధారణలో నిరసన తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. తాము పార్లమెంటు బయట, లోపల నిరసనలు తెలుపుతామన్నారు. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. సంధియా, సమరమా తేల్చాలని బీజేపీని ప్రశ్నించారు.
ఏపీకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెబుతూ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేయనున్నాయి.












Click it and Unblock the Notifications