విధ్యార్థినులను లైంగికంగా వేధిస్తోన్న టీచర్ ,తల్లిదండ్రులు ఏం చేశారంటే
ప్రతిరోజూ మద్యం తాగి వస్తూ విధ్యార్థినులను లైంగికంగా వేధిస్తోన్న టీచర్ పై దేహశుద్ది చేశారు విధ్యార్థినుల తల్లిదండ్రులు.గదిని శుభ్రం చేసే పేరుతో విధ్యార్థినులను నెల్లూరు :భావి లైంగికంగా వేధిస్తున్నాడు.
నెల్లూరు :భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఉపాధ్యాయుడి వేధింపులు భరించలేక స్కూల్ కు వెళ్ళేందుకు విధ్యార్థినులు ఇబ్బందిపడుతున్నారు .విధ్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్ళే సరికి టీచర్ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించిన స్థానికులు ఉపాధ్యాయుడిని చితకబాదారు.
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని ఆరూరు ప్రాథమిక పాఠశాలలో శ్రీనివాసులు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే స్కూల్ లోని ఐదవతరగతి చదివే విధ్యార్థినులను పక్కగదిని శుభ్రపరిచే నెపంతో విధ్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.
ప్రతిరోజూ విధ్యార్థినులపై అతను వేధింపులకు పాల్పడుతున్నాడు. మద్యం తాగి వచ్చి పాఠాలు చెప్పకుండా విధ్యార్థినులను వేధిస్తున్నట్టు విధ్యార్ధినులు ఆరోపిస్తున్నారు. స్కూల్ కు వెళ్ళేందుకు విధ్యార్థినులు మొండికేస్తుండడంతో తల్లిదండ్రులు స్కూల్ కు రావడంతో అసలు విషయం బయటపడింది.
మద్యం మత్తులో టీచర్ శ్రీనివాసరావు ఉన్నాడు. విధ్యార్థినులపై లైంగిక దాడుల విషయాన్ని టీచర్ ను నిలదీశారు తల్లిదండ్రులు. టీచర్ కు దేహశుద్ది చేశారు. ఈ విషయాన్ని ఎంఇఓ కు , పోలీసులకు సమాచారం ఇచ్చారు తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.