వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్డినెన్స్‌లా చించలేరా?: టి కేబినెట్ నోట్‌పై వాసిరెడ్డి పద్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vasireddy Padma
హైదరాబాద్: జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యుల సభ్యత్వాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌నే చించేశారని.. అలాంటిది తెలంగాణపై కేబినెట్ నోట్‌ను చించలేరా అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం మండిపడ్డారు. ఆమె పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనీసం కేబినెట్ నోట్‌ను ఆపలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధం చేయడం అంటే సీమాంధ్ర ప్రజలను అవమానించడమేనన్నారు. 65 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

సీమాంధ్ర ప్రజల ఆవేదన కేంద్రానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చివరి బంతి వరకు పోరాడుతామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు తల పగిలేలా ఉన్నా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

మంత్రులు ఏం చేస్తారు: అశోక్ బాబు

కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ వస్తే ఏం చేస్తారో కేంద్రమంత్రులు చెప్పాలని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ పైన నోట్ వస్తే రెండు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తెరాస నాయకులకు లేఖలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రజాప్రతినిధులకు బహిరంగ లేఖలు రాయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

English summary
YSR Congress Party spokes Person Vasireddy Padma on Thursday suggested Congress High Command tear the Telangana note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X