వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బై‌క్‌పై చెట్టు కూలి టెక్కీ మృతి: భార్యకి గాయాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dead
హైదరాబాద్: పెళ్లి వేడుక చేసుకోవడానికి భార్యతో పాటు ద్విచక్రవాహనంపై వెళ్తున్న 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మృత్యువు కబళించింది. పెళ్లి చేసుకోవడానికి తగిన చర్చి కోసం వెతుకుతూ బైక్‌పై ప్రేయసితో పాటు టెక్కీ వెళ్తుండగా సోమవారం సుచిత్ర జంక్షన్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన యాప్రాల్‌కు చెందిన మృతుడు పనబాక రోహిత్ ఇటీవలే ఉద్యోగం వదిలేసి పూజారి కావడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ వస్తున్నాడు. రెండు నెలల క్రితం అతను సైనిక్‌పురికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రితిక లూయిస్ కర్నంను వివాహం చేసుకున్నాడు. ఆమె హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.

పెళ్లి వేడుక కోసం రిజర్వేషన్ చేసుకోవడానికి రోహిత్ తన భార్య రితికతో కలిసి కొంపల్లిలోని గుడ్ షెపర్డ్ చర్చికి ద్విచక్రవాహనంపై సోమవారం బయలుదేరాడు. మేడ్చేల్ హైవే సర్వీస్ రోడ్డుపై వెళ్తుండగా ఓ భారీ వృక్షం వారిపై కూలి పడింది. ఈ ఘటనలో వారిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

తలకు బలమైన గాయాలు కావడంతో రోహిత్ చికిత్స పొందుతూ మరణించాడు. రితిక తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రమాదం నుంచి బయటపడినట్లేనని వైద్యులు చెబుతున్నారు.

English summary
A 27-year-old software engineer, who was travelling on a two-wheeler along with his fiancee to look for a suitable church for their wedding, died when a tree fell on them near Suchitra junction on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X