బీజేపీ జగ్గారెడ్డికి గుండు కొడుతారు: కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు స్థానానికి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి మెదక్ ప్రజలు మరోసారి గుండు కొరిగి పంపిస్తారని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. ఆయన మంగళవారం సికింద్రాబాద్ బాలంరాయిలోని గీతాంజలి పాఠశాలలో జరిగిన ప్రధాన ఉపాధ్యాయుల సెమినార్, ఉపాధ్యాయుల వర్క్ షాప్ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గారెడ్డిని తమ పార్టీ తరపున టికెట్ ఇచ్చి మెదక్ నుంచి పోటీ చేయించడం బిజెపి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తానని, లేకుంటే రాజకీయ సన్యాయం తీసుకుంటానని ప్రకటించిన జగ్గారెడ్డి.. గడ్డం, మీసాలు తీసేసి మళ్లీ రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోమారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఆయనకు గుండుకొరగడం ఖాయమని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ తరపున మెదక్ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని ప్రజలు ఆదరించి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, ఉపాధ్యాయులకు జరిగిన ఈ వర్క్షాప్లో విద్యా విధానంలో కొనసాగుతూ వస్తున్న ఉత్తమ పద్ధతుల గురించి, భవిష్యత్తులో పాటించాల్సిన బోధనా పద్ధతుల గురించి చర్చించారు.

కెటిఆర్
మెదక్ పార్లమెంటు స్థానానికి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న జగ్గారెడ్డికి మెదక్ ప్రజలు మరోసారి గుండు కొరిగి పంపిస్తారని రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు.

కెటిఆర్
కాంగ్రెస్ పార్టీకి చెందిన జగ్గారెడ్డిని తమ పార్టీ తరపున టికెట్ ఇచ్చి మెదక్ నుంచి పోటీ చేయించడం బిజెపి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.

కెటిఆర్
ఆయన మంగళవారం సికింద్రాబాద్ బాలంరాయిలోని గీతాంజలి పాఠశాలలో జరిగిన ప్రధాన ఉపాధ్యాయుల సెమినార్, ఉపాధ్యాయుల వర్క్ షాప్ను ఆయన ప్రారంభించారు.

గీతాలాపన
మంగళవారం సికింద్రాబాద్ బాలంరాయిలోని గీతాంజలి పాఠశాలలో జరిగిన ప్రధాన ఉపాధ్యాయుల సెమినార్, ఉపాధ్యాయుల వర్క్ షాప్లో గీతాలపన చేస్తున్న విద్యార్థులు

కెటిఆర్
గత అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తానని, లేకుంటే రాజకీయ సన్యాయం తీసుకుంటానని ప్రకటించిన జగ్గారెడ్డి.. గడ్డం, మీసాలు తీసేసి మళ్లీ రాజకీయాల్లో ఎందుకు కొనసాగుతున్నాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

కెటిఆర్
మరోమారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఆయనకు గుండుకొరగడం ఖాయమని చెప్పారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications