వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని చెప్పారు, టి ఖాయం: కోదండ, ప్రణబ్‌దేనన్న రవి

|
Google Oneindia TeluguNews

Kodandaram
న్యూఢిల్లీ: తాము తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తెలంగాణ రాజకీయ జెఏసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు కూడా హామి ఇచ్చారనికోదండరాం తెలిపారు.

తెలంగాణ ఏర్పాటుకు తమవంతు కృషిగా అన్ని పార్టీలను కలిసి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని కోదండరాం చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణ ఇవ్వాలనే ఉందని తెలంగాణ గెజిటెడ్ అధికారం సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణపై వెనకడుగు వేస్తే రాష్ట్రం అల్లకల్లోం అవుతుందని ఆయన హెచ్చరించారు.

విభజనపై తుది నిర్ణయం రాష్ట్రపతిదే: రవిశంకర్

రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం విభజన విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్రపతిదే అని అసెంబ్లీ న్యాయ సలాహాదారు జంద్యాల రవిశంకర్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

విభజన విషయంలో కేంద్రమంత్రుల బృందం (జిఓఎం) సూచనలే ఫైనల్ అని ఎక్కడా లేదని రవిశంకర్ అన్నారు. జిఓఎం సూచనలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బిల్లు విషయలో న్యాయ సలహా తీసుకోవాలని ప్రణబ్ ముఖర్జీకి రవిశంకర్ విజ్ఞప్తి చేశారు.

English summary

 Telangana Political JAC Chairman Prof. Kodandaram on Wednesday said that Telangana state will be established.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X