ఫిబ్రవరిలో తెలంగాణ: యాష్కీ, చర్చపై కుట్ర: కెకె

తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఆశించిన స్థాయిలో చర్చ జరగకపోవడం వెనక సీమాంధ్రుల కుట్ర ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. కేశవరావు అన్నారు. సమయం సరిపోలేదన్న సాకుతో చర్చకు గడువు కోరి విభజన ప్రక్రియను జాప్యం చేసేందుకు పన్నాగం వేస్తున్నారని ఆయన అన్నారు.
శనివారంనాడు ఆయన హైదరాబాదులో తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. తెలుగుజాతి రెండుగా చీలిపోయిందని, ఇక కలపడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
తెలియని స్థితిలో ముఖ్యమంత్రి
అవగాహనా రాహిత్యం, అవివేకం, అహంకారం మూడు కలిపితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవుతారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఏ ప్రాంతానికి చెందినవాడో తెలియని స్థితికి దిగజారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి, నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ బిల్లుపై చర్చను భావోద్వేగాలు, ప్రాంతాలకు అతీతంగా చర్చించాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. ఇరు ప్రాంతాల్లో ఉన్న పార్లమెంటు సభ్యులు బిజెపితే సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన అన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications