తెలుగు మీడియం దండగ, ర్యాంకులు రావు: మంత్రి నారాయణ
తెలుగు మీడియం దండగ అని, తెలుగు మీడియంలో చదివితే ర్యాంకులు రావని చెప్పుకొచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. నంద్యాలలోని మున్సిపల్ స్కూలులో తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు : 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని ఆనాడు శ్రీ కృష్ణ దేవరాయలు మన తెలుగు భాష గురించి కీర్తిస్తే... ఈనాడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాత్రం 'తెలుగు మీడియం దండగ' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆయన ఊరుకోలేదు.. తెలుగు మీడియంలో చదివితే ర్యాంకులు రావంటూ చెప్పుకొచ్చారు. అయిదువేల లోపు ర్యాంకు వచ్చే వాళ్లలో ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థులు ఉండరంటూ మంత్రి నారాయణ కొత్త భాష్యం చెప్పారు.

ఇంగ్లీష్ మీడియం అయితేనే ర్యాంకులు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తున్నామని ఆయన చెప్పారు.
నంద్యాలలో మున్సిపల్ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులతో ముఖాముఖీ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా కొన్నాళ్లు పోతే 'ర్యాంకులు రాని విద్యార్థులు కూడా దండగ' అంటారేమో.. ఒకవేళ అలా అంటే.. అప్పుడా విద్యార్థులను ఏం చేయాలి?
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications