కవి, కథా రచయిత ధేనువకొండ శ్రీరామమూర్తి ఇక లేరు
కవి, రచయిత డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి కన్ను మూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్: కవి, రచయిత డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి కన్ను మూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీరామమూర్తి హైదరాబాదులో స్థిరపడ్డారు.
హైదరాబాదులో ఆయన సిద్దేశ్వర రిసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం అనే సంస్థను నడిపారు. తన వృత్తిలో తీరిక లేకుండా ఉంటూనే ఆయన కవిత్వ రచన, కథా రచన చేశారు. ఆయన చింతయామి, ఆశల సముద్రం, వల్మీకం, మోహ తిమిరం అనే కవితా సంపుటాలను వెలువరిచారు. అమ్మ ఒడి అనే దీర్ఘకవిత రాశారు.

ఐలాండ్ విల్లా పేర కథల సంపుటిని వెలువరించారు. ఒంగోలు ప్రాంత జీవిత వాస్తవికతని ఐలాండ్ విల్లా కథలు తెలియజేస్తాయని సాహిత్యకారుడు కెపి అశోక్ కుమార్ అన్నారు. తెలుగు సాహిత్య విమర్శకుడు గుడిపాటికి ఆయన సన్నిహితుడు. డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి రాసిన తొలి నవల స్నిగ్ధచాయ.
ఈ నవలలో మానవ జీవిత అనేక కోణాలను అనేక పార్శ్వాలను చిత్రించిన తీరు బావందని అంపశయ్య నవీన్ రాశారు. ఈ నవలకు 2014 సంవత్సరంలో రచయిత తొలినవలకు ఇచ్చే 10000రూపాయల బహుమతిని అంపశయ్య నవీన్ లిటెరరీ ట్రస్ట్ ఈ రోజు వరంగల్ లో అందజేసింది.
వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడైన ధేనువకొండ శ్రీరామమూర్తి 1947లో సంగీత, సాహిత్య సంప్రదాయాలు గల కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, రామసుబ్బారావు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో పియుసి చదివారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బిఎఎంఎస్ చదివారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications