వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గానాబజానాలకు అలవాటుపడ్డారు, పతనమే: కెసిఆర్‌పై రేవంత్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి పతనం పాలమూరు నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. కెసిఆర్ గెస్ట్‌హౌజ్‌ల్లో గానాబజాలకు అలవాటు పడ్డారని మండిపడ్డారు.

కడియం శ్రీహరి డిప్యూటేషన్‌పై వచ్చిన డిప్యూటీ సిఎం అని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రతి పనికీ కమిషన్ తీసుకుని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.

 Revanth Reddy

పార్టీని వీడిన నాయకులు అనాథలుగా మిగలిపోతారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేను ఆకర్షించడం వల్ల టీఆర్‌ఎస్‌ బలపడుతుందని అనుకోవడం కేసీఆర్‌ భ్రమని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌ పరిపాలనలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురవుతోందని, గ్రీన్‌హౌస్‌ వ్యవసాయం, యూనివర్సిటీల తరలింపే ఇందుకు నిదర్శనమన్నారు.

పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల జిల్లా విషపూరితంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేసి.. జూరాల, పాకాలను ప్రారంభిస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. యాదగిరిగుట్టను ఆంధ్రీకరించి యాదాద్రిగా మార్చారని రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్ జోగులాంబ, మన్యంకొండలపై నిర్లక్ష్యం తగదని రేవంత్ రెడ్డి అన్నారు.

English summary
Telugudesam party MLA Revanth Reddy on Wednesday fired at Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X