మూడునెలల పాటు నిప్పుల కుంపటిలా దేశం.. వేసవి ఎద్దడి, కరువుకు ఛాన్స్; హెచ్చరించిన డబ్ల్యూఎంఓ!!
వేసవికాలం ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఇక భారతదేశంలో, అందునా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటినుంచి మే నెల చివరిదాకా ఎండలు నిప్పుల కొలిమిలా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మూడు నెలలు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఇదే విషయాన్ని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ డబ్ల్యూ ఎం ఓ తాజాగా వెల్లడించింది.
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం ఎల్ నినో ప్రభావం తోపాటు, వాతావరణం లో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ హెచ్చరించింది. గత ఏడాది జూన్లో ఎల్ నినో ఏర్పడిన నాటి నుండి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది.

ఎల్ నినో ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్ లు పెరుగుతాయి. పసిఫిక్ మహాసముద్రంపైన నీళ్ళు వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. ఇది ఏర్పడిన సంవత్సరాలలో వాతావరణంలో గణనీయమైన మార్పులు వస్తాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా దక్షిణ అమెరికా, ఈశాన్య ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తాయి, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ ఆసియా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడతాయి.
ఎల్ నినో రెండు నుంచి ఏడు ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. గతంలో 2015 - 2016 లో ఈ పరిస్థితులు వచ్చాయి. ఇక ప్రస్తుతం ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులు దాదాపు 9 నెలల నుంచి 12 నెలల పాటు కొనసాగుతాయి. ఆ తర్వాత ఫసిపిక్ మహా సముద్ర జలాలు చల్లారే లా నినా ఏర్పడే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ పేర్కొంది.
ఏది ఏమైనా ఈసారి ఎండలు మండుతాయి అని పదేపదే చెబుతున్న వాతావరణ సంస్థలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఎల్ నినో పరిస్థితుల కారణంగా కరువు వచ్చే అవకాశం ఉన్నందున, దానిని ఎదుర్కొనే విధంగా సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని వాతావరణ సంస్థలు నొక్కి చెబుతున్నాయి.
-
పాకిస్తాన్ అనాగరిక దాడి- తీవ్రంగా స్పందించిన భారత్..! -
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications