తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం, అమరావతిలో శీతాకాల సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో ప్రభుత్వం తాత్కాలిక శాసన సభా భవనాన్ని నిర్మించనుంది. ఇందుకు సంబంధించి సభాపతి కోడెల శివప్రసాద రావు ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక భవనం, యుద్ధ ప్రాతిపదికన నిర్మించనున్నందున ఎలాంటి అక్రమాలు జరగవద్దని ఆదేశించారు.
గుంటూరు జిల్లా తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీని నిర్మించనున్నట్లు కోడెల మంగళవారం చెప్పారు. అసెంబ్లీ నిర్మాణం కోసం వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు.
ఐదు రోజుల పాటు తుళ్లూరులోనే శీతాకాల సమావేశాలు జరపనున్నట్లు కోడెల చెప్పారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలో తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. ఐదెకరాలలో ఈ భవనం నిర్మిస్తారు.

ఏపీ శాసన మండలి సమావేశాలు కూడా తుళ్లూరులోనే జరపాలని నిర్ణయించారు. స్పీకర్ ఓకే చెప్పినందున త్వరలో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుత శాసన సభను తలపించేలా రూపకల్పన చేయనున్నారు.
స్పీకర్ కోడెల శివప్రసాద్ డిజైన్లు పరిశీలించారు. వాటిని ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు ఆమోదానికి పంపించారు. చంద్రబాబు ఆమోదం రాగానే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
-
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !! -
Amaravati: అమరావతికి కేంద్రం మరో గిఫ్ట్-బిల్లు ఆమోదించిన 24 గంటల్లో..! -
Mavigun Vs Amaravati: అమరావతి కంటే మావిగాన్ ఎలా బెటర్ ? అంబటి వివరణ..! -
జగన్ కు 'మావిగన్' సలహా ఆయనదే, అసలు టార్గెట్..!! -
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
శూన్యం నుంచి సృష్టి వరకు.. చరిత్ర నిన్ను క్షమించదు జగన్ -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications