ఎత్తు రగడ: ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత, జగన్ ఎమ్మెల్యే ధర్నా
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని కోస్గి మండలం ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఆర్డీఎస్ వద్ద ఆదివారం ఉద్రిక్తత తలెత్తింది. కర్నాటక సర్కార్ రెండడుగుల ఎత్తు పెంచాలని పనులు చేపట్టడంతో కర్నూలు జిల్లాకు చెందిన రైతులు ఆర్డీఎస్ వద్ద ఆందోళనకు దిగారు.
కోస్గి దగ్గర రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీని వల్ల మూడువేల టీఎంసీల నిలువ నీరు రావలసి ఉండగా ఇప్పటి వరకు రాలేదని చెబుతూ.. రైతులు భారీ సంఖ్యలో ధర్నా చేపట్టారు. ఆనకట్ట ఎత్తు పెంచుతున్నారనే సమాచారంతో కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆందోళనకు దిగారు.

ఆర్డీఎస్ ఎత్తు పెంచే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ ఆయన ఆందోళనకు దిగారు. రెండు ప్రాంతాల అధికారులు చర్చించి ఆనకట్ట ఎత్తు పెంచాలని, అప్పటి వరకు పనులు ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రెండు ప్రాంతాల రైతులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications