తిరుమల ఆలయానికి తాళం: కంపార్టుమెంట్లల్లో భక్తులు- ఏర్పాట్లు
Lunar eclipse 2025: నేడు చంద్ర గ్రహణం ఏర్పడబోతోంది. ఇది- పౌర్ణమి రోజున రాహుగ్రస్త కాలంలో శతభిష నక్షత్రంలో ఏర్పడనున్న సంపూర్ణ చంద్ర గ్రహణం. 2022 తరువాత ఇలాంటి ఘటన సంభవించబోతోండటం ఇదే తొలిసారి. ఆ రోజు నుంచే పితృపక్షం ఆరంభం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ గ్రహణం కనువిందు చేయనుంది.
రాత్రి 9:57 నిమిషాలకు గ్రహణ కాలం ఆరంభమౌతుంది. 82 నిమిషాల పాటు కొనసాగుతుంది. అత్యంత సుదీర్ఘ గ్రహణ కాలం ఇది. 11 గంటల సమయానికి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 11:42 నిమిషాలకు చంద్రుడు పరిపూర్ణంగా గ్రహణ ఛాయలోకి వెళ్లిపోతాడు. అర్ధరాత్రి దాటిన తరువాత 12:22 నిమిషాలకు గ్రహణం విడుస్తుంది. వేకువ జామున 1:26 నిమిషాలకు గ్రహణం పూర్తిగా వీడిపోతుంది.

తిరుమల శ్రీవారి ఆలయం..
ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ద్వారాలను మూసివేశారు. శాస్త్రోక్తంగా శుద్ధి తదితర కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరంత సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మళ్లీ శ్రీవారి ఆలయ ద్వారాలు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ లల్లో వేచి ఉన్న భక్తులందరికీ నిర్దేశిత సమయానికి అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కలిగిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అన్నప్రసాదం కాంప్లెక్స్, వకుళమాత, పీఏసీ- 2, వైకుంఠం వంటశాలలు మూసి వేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నప్రసాద విభాగం భక్తుల కోసం 50,000 పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసింది. అన్నప్రసాద వితరణ సోమవారం ఉదయం 8 గంటల నుండి పునః ప్రారంభమౌతుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం..
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని ఈ మధ్యాహ్నం 2:15 నిమిషాల నుండి మూసివేశారు. సోమవారం తెల్లవారు జాము 4 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యవచనం చేస్తారు. ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం..
శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఈ మధ్యాహ్నం 1.30 నుండి 3 గంటల వరకు శుద్ధి, పూలంగి సేవ, శాత్తుమొర తదితర సేవలను ఏకాంతంగా నిర్వహించారు. 3:30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 4.30 నుండి పలు సేవల అనంతరం ఉదయం 9.30 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
శ్రీనివాస మంగాపురం ఆలయం..
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఈ మధ్యాహ్నం 1.30 గంటల నుండి 3.00 గంటల వరకు కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. 3.30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 4.45 నిమిషాలకు తెరుస్తారు. తదుపరి ఏకాంత సేవల తర్వాత ఉదయం 8.30 గంటలకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
కపిలతీర్థం..
కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మద్యాహ్నం 1.30 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయశుద్ధి, సుప్రభాతం, అభిషేకం, అర్చన సేవల తదుపరి ఉదయం 7 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
-
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications