హ్యాట్రిక్ కోసం జగన్ ప్లాన్, రిటన్ గిఫ్ట్ కోసం ఓటర్లు వెయిటింగ్, లీడర్స్ కు టెన్షన్, రివర్స్ గేమ్ !
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోరు నువ్వానేనా అన్నట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఒకేసారి లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని ఓ నియోజక వర్గంలో ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్న వైఎస్ జగన్ కు రివైంజ్ గిఫ్ట్ ఇస్తామని స్థానిక ఓటర్లు అంటున్నారు.
భారతదేశంలోనే అతి పెద్ద డివిజన్ గా పేరు ఉన్న మదనపల్లె నియోజక వర్గంలో గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేది. తరువాత చిత్తూరు జిల్లా నుంచి మదనల్లెను విడదీసి ఆ ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేయడంతో పాటు జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించారు. జగన్ ప్రభుత్వం మదనపల్లెకు తీరని అన్యాయం చేసిందని ఆ ప్రాంతంలోని ప్రజలు రగిలిపోతున్నారు.

మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గంలో వరుసగా రెండు సార్లు వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. జగన్ సీఎం అయిన తరువాత కొత్త జిల్లాలు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద డివిజన్ గా పేరు ఉన్న మదపల్లెలో బ్రిటీష్ కాలం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం, పోలీసు శాఖకు చెందిన డీఎస్పీ కార్యాలయాలు, ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్యాశాఖల కార్యాలయాలు ఉన్నాయి.

ఇక శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ తరువాత రాయలసీమలో అంత పెద్ద కాలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న బీటీ కాలేజ్ కూడా మదనపల్లెలోనే ఉంది. అలాంటి చరిత్ర ఉన్న మదనపల్లెను అన్నమ్య జిల్లా కేంద్రంగా చెయ్యాలని అప్పట్లో పార్టీలకు అతీతంగా పోరాటం చేశారు. అయితే సీఎం జగన్ సన్నిహితుడు, వైసీపీలో మంచి పలుకుబడి ఉన్న ఆ పార్టీ విప్, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పట్టుబట్టి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని చేశారు.
సీఎం జగన్ మదనల్లెకు తీరని ద్రోహం చేశారని మదనపల్లె ప్రజలు రగిలిపోతున్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటి పేరు ప్రకటించడంతో మదనపల్లెలో వ్యాపారలావాదేవీలు దెబ్బతిన్నాయి. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే వచ్చిన నష్టం ఏమిటి అని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రజలు ఇంకా రగిలిపోయారు. పార్టీ హైకమాండ్ ఒత్తిడితో ఆ రోజు అలాంటి వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషాను పక్కన పెట్టిన వైసీపీ ఇప్పుడు మరో మైనార్టీ నాయకుడు నిషార్ అహమ్మద్ కు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది.

మదనపల్లెను జిల్లా కేంద్రంగా పెట్టాలని ఆ రోజు ఆందోళన చేసిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సొంత అన్న, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఇప్పుడు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో మదనపల్లెకు ఆ రోజు అన్యాయం జరిగినా పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు మదనపల్లెలో హ్యాట్రిక్ కోసం పావులు కదుపుతున్నారు.
బలిజ, మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండే మదనపల్లె నియోజక వర్గం ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని మదనపల్లె నియోజక వర్గంలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తం మీద మదనపల్లెలో వైఎస్ జగన్ హ్యాట్రిక్ మంత్రం పని చేస్తుందా ?, లేక జిల్లా కేంద్రంగా అన్యాయం చేసిన ఆ పార్టీకి మదనపల్లె ప్రజలు రివైంజ్ గిఫ్ట్ ఇస్తారా ? అని వేచి చూడాలని మదనపల్లె నియోజక వర్గం ప్రజలు అంటున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications