Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హ్యాట్రిక్ కోసం జగన్ ప్లాన్, రిటన్ గిఫ్ట్ కోసం ఓటర్లు వెయిటింగ్, లీడర్స్ కు టెన్షన్, రివర్స్ గేమ్ !

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోరు నువ్వానేనా అన్నట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఒకేసారి లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని ఓ నియోజక వర్గంలో ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్న వైఎస్ జగన్ కు రివైంజ్ గిఫ్ట్ ఇస్తామని స్థానిక ఓటర్లు అంటున్నారు.

భారతదేశంలోనే అతి పెద్ద డివిజన్ గా పేరు ఉన్న మదనపల్లె నియోజక వర్గంలో గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేది. తరువాత చిత్తూరు జిల్లా నుంచి మదనల్లెను విడదీసి ఆ ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేయడంతో పాటు జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించారు. జగన్ ప్రభుత్వం మదనపల్లెకు తీరని అన్యాయం చేసిందని ఆ ప్రాంతంలోని ప్రజలు రగిలిపోతున్నారు.

The people of Madanapalle constituency are putting brakes on YACP s hat-trick victory
మదనపల్లెలో ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీ, ఐదు సార్లు తెలుగుదేశం, రెండు సార్లు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. జగన్ పార్టీ పెట్టిన తరువాత మదనపల్లెలో దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ జెండాతో ఎమ్మెల్యే అయ్యారు. తరువాత వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డిని పక్కన పెట్టి నవాజ్ బాషాకు టిక్కెట్ ఇవ్వడంతో మరోసారి మదనపల్లెలో వైసీపీ జెండా ఎగరేసింది.

మదనపల్లె అసెంబ్లీ నియోజక వర్గంలో వరుసగా రెండు సార్లు వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. జగన్ సీఎం అయిన తరువాత కొత్త జిల్లాలు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలోనే అతి పెద్ద డివిజన్ గా పేరు ఉన్న మదపల్లెలో బ్రిటీష్ కాలం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం, పోలీసు శాఖకు చెందిన డీఎస్పీ కార్యాలయాలు, ఎమ్మార్వో, ఎంపీడీవో, విద్యాశాఖల కార్యాలయాలు ఉన్నాయి.

The people of Madanapalle constituency are putting brakes on YACP s hat-trick victory

ఇక శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ తరువాత రాయలసీమలో అంత పెద్ద కాలేజ్ గా గుర్తింపు తెచ్చుకున్న బీటీ కాలేజ్ కూడా మదనపల్లెలోనే ఉంది. అలాంటి చరిత్ర ఉన్న మదనపల్లెను అన్నమ్య జిల్లా కేంద్రంగా చెయ్యాలని అప్పట్లో పార్టీలకు అతీతంగా పోరాటం చేశారు. అయితే సీఎం జగన్ సన్నిహితుడు, వైసీపీలో మంచి పలుకుబడి ఉన్న ఆ పార్టీ విప్, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పట్టుబట్టి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని చేశారు.

సీఎం జగన్ మదనల్లెకు తీరని ద్రోహం చేశారని మదనపల్లె ప్రజలు రగిలిపోతున్నారు. జిల్లా కేంద్రంగా రాయచోటి పేరు ప్రకటించడంతో మదనపల్లెలో వ్యాపారలావాదేవీలు దెబ్బతిన్నాయి. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే వచ్చిన నష్టం ఏమిటి అని అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో ప్రజలు ఇంకా రగిలిపోయారు. పార్టీ హైకమాండ్ ఒత్తిడితో ఆ రోజు అలాంటి వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషాను పక్కన పెట్టిన వైసీపీ ఇప్పుడు మరో మైనార్టీ నాయకుడు నిషార్ అహమ్మద్ కు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది.

The people of Madanapalle constituency are putting brakes on YACP s hat-trick victory

మదనపల్లెను జిల్లా కేంద్రంగా పెట్టాలని ఆ రోజు ఆందోళన చేసిన వారిలో సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సొంత అన్న, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఇప్పుడు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. టీడీపీ అధికారంలోకి వస్తే మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో మదనపల్లెకు ఆ రోజు అన్యాయం జరిగినా పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు మదనపల్లెలో హ్యాట్రిక్ కోసం పావులు కదుపుతున్నారు.

బలిజ, మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండే మదనపల్లె నియోజక వర్గం ప్రజలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం కడుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్ణాటక సరిహద్దులోని మదనపల్లె నియోజక వర్గంలో దేశ విదేశాలకు చెందిన వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. మొత్తం మీద మదనపల్లెలో వైఎస్ జగన్ హ్యాట్రిక్ మంత్రం పని చేస్తుందా ?, లేక జిల్లా కేంద్రంగా అన్యాయం చేసిన ఆ పార్టీకి మదనపల్లె ప్రజలు రివైంజ్ గిఫ్ట్ ఇస్తారా ? అని వేచి చూడాలని మదనపల్లె నియోజక వర్గం ప్రజలు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+