వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దొంగలు బీభత్సం....చోరీ అనంతరం హత్య
అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తన ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అడ్డుకునే క్రమంలో ఆ ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురం: అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తన ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అడ్డుకునే క్రమంలో ఆ ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయారు.జిల్లాలోని గుత్తి కుమ్మరవీధిలోని ఓ ఇంట్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దౌర్జన్యంగా ప్రవేశించారు.
ఇంట్లో బీరువాలు, లాకర్లు వెతుకుంతుండగా ఇది గమనించిన ఇంటి యజమాని దొంగలను అడ్డుకున్నారు. కానీ దోపిడీ దొంగలు యజమానిని హత్యచేసి 25 తులాల బంగారం, రూ. 5లక్షల నగదుతో ఉడాయించారు.
స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Comments
English summary
Uniedintified persons stolen gold ornamaents and cash and killed house owner in Ananthapur district of Andhra Pradesh
Story first published: Saturday, September 16, 2017, 9:50 [IST]