ఫేస్ బుక్ లో పరిచయమయ్యారు. గుళ్ళో పెళ్ళిచేసుకొన్నారు. తర్వాత ఏమైందంటే
ప్రేమించి పెళ్ళిచేసుకొని వంచించిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది ఓ యువతి,. విజయవాడ పటమటకు చెందిన ఓ యువతి ని హేమంత్ అనే యువకుడు ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. తర్వాత కన్పించకుండా పోయాడు.
హైదరాబాద్ :ప్రేమించిన యువతిని వివాహం చేసుకొన్నాడు. తర్వాత డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలని చూశాడు. అయితే బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతోంది. విజయవాడ పోలీసులను ఆశ్రయించింది.ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకొంది.
విజయవాడ పటమట దర్శిపేటకు చెందిన ఓ యువతి డిప్లోమా పూర్తి చేసింది. ఆమెకు ఆరుమాసాల క్రితం పటమట కు చెందిన హేమంత్ బాబు అనే యువకుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆగష్టులో ఆ యువతి పుష్కరాల్లో వలంటీర్ గా పనిచేసింది.
ఆమె పుష్కరాల్లో వలంటీర్ గా పనిచేస్తున్న సమయంలో ఆమె వద్దకు ప్రతిరోజూ వచ్చేవాడు.దీంతో వారిద్దరి మద్య పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్ళిచేసుకోవాలని భావించారు.
యువతిని పెళ్ళిచేసుకొనేందుకు తమ ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని ఆ యువతిని దుర్గగుడిలో ఆ యువకుడు ఈ ఏడాది అక్టోబర్ 23వ, తేదిన వివాహం చేసుకొన్నాడు.భవానీపురంలో ఇల్లు తీసుకొని ఐదురోజులపాటు కాపురం చేశారు.

అయితే యువకుడి తల్లిదండ్రులు వచ్చి సంప్రదాయబద్దంగా వివాహం జరిపిస్తామని చెప్పి హేమంత్ ను తీసుకుపోయారు.దీంతో ఆ యువతి కూడ తన ఇంటికి వచ్చేసింది.
కారులో తీసుకెళ్ళి కొట్టారు.
ఆ తర్వాత హేమంత్ బంధువు రామారావు వచ్చి నువ్వంటే హేమంత్ కు ఇష్టం లేదంటూ ఐదు లక్షలు తీసుకొని అన్ని మర్చిపోవాలని యువతికి చెప్పాడు. ఆ తర్వాత ఆమెను కారులో తీసుకొని వెళ్ళాడు. హేమంత్ ను మర్చిపోవాలని కొట్టాడని ఆమె పోలీసులకు చెప్పింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె పట్టించుకోవడం లేదన్నారు.
దీంతో స్ధానిక ప్రజాప్రతినిధులను తీసుకొని ఆమె పోలీసు ఉన్నతాధికారులను సోమవారంనాడు కలిసింది. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరింది.నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేస్తామని వారు హమీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications