భార్యను లా చదివిస్తున్న గజదొంగ ప్రకాష్ సాహూ
విజయవాడ: ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న గజ దొంగ ప్రకాష్ సాహూ తన భార్యను న్యాయశాస్త్రం చదివిస్తున్నాడు. అందుకు అవసరమైన డబ్బులను అతను సమకూర్చినట్లు సమాచార. ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో దోపిడీ చేశాడనే ఆరోపణపై విచారణ నిమిత్తం పోలీసులు సాహూను తమ కస్టడీలోకి తీసుకున్నారు.
సాహూ భార్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిలాయ్లో న్యాయశాస్త్రం అభ్యసిస్తోంది. పిల్లలు సొంత పట్టణంలోనే పాఠశాలకు వెళ్తున్నారు. సాహూ 1980 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాల్లో సాహూ 47 హిందూ, జైన ఆలయాల్లో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కనకదుర్గ గుడిలో ప్రకాష్ సాహూ అమ్మవారి కిరీటంతో పాటు ఆభరణాలన్నీ దోచుకున్నాడు. ఈ సంఘటన 1988లో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కన్యకాపరమేశ్వరి ఆలయంలో కూడా అతను దోపిడీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆభరణాలను దోచుకునే ముందు సాహూకు దేవుళ్లకు ప్రార్థనలు చేసే అలవాటు ఉంది. నాలుగు దేవాలయాల్లో దోపిడీకి పాల్పడినట్లు సాహూ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒంగోలు, విజయనగరం, తూర్పు గోదావరి, విజయవాడల్లో దోపిడీలకు పాల్పడినట్లు సాహూ అంగీకరించినట్లు సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications