బురఖా వేసుకొని ఇంట్లోకి చొరబడ్డ దొంగ...అరిచిందని పొడిచాడు
గుంటూరు:దొంగలు తెలివిమీరారు...పట్టపగలే ఎవరికీ అనుమానం రాకుండా దోపిడీలు చేసేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో చోరీకి వచ్చిన ఓ దోపిడీ దొంగ ఉదంతం జిల్లాలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే....
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో బురఖా వేసుకొన్న ఓ మహిళ హఠాత్తుగా ఓ ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో మహిళ వంటరిగా ఉండటం చూసి బురఖాతో వచ్చిన మహిళ తన నిజస్వరూపం చూపించగా, అప్పుడు ఆ బురఖా వేసుకొని వచ్చింది మహిళ కాదని పురుషుడు అని తెలిసింది. మొహంపై బురఖా ముసుగు తప్పించిన దొంగ ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తి చూపుతూ బీరువాలోని నగదు, బంగారం తీసి ఇవ్వమని బెదిరించాడు.

దీంతో భయపడిపోయిన ఆ మహిళ ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ ప్రతిఘటించింది. దీంతో కంగారు పడిన ఆ దొంగ మహిళను అరవద్దంటూ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈమె కేకలు విన్న చుట్టుపక్కలవారు ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా మహిళను ఆస్పత్రికి తరలించి అనంతరం జరిగిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications