చంద్రబాబు భేష్, వైఎస్ తటపటాయించారు: తోట నరసింహం
న్యూఢిల్లీ: ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటారన్న విశ్వాసాన్ని లోక్సభలో టిడిపి పక్షం నేత తోట నరసింహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కూడా కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలోచేర్చటారికి తటపటాయించారన్నారు.
కాపులను బిసిల జాబితాలో చేర్చి వారి అభ్యున్నతి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాపుల జీవితాలలో కొత్త వెలుగులు ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను బిసిల్లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

పుట్టుస్వామి కమిషన్ నివేదిక సమర్పించే నాటికి ఉన్న కాపుల జనాభా ఈ మధ్యలో పెరిగి ఉంటుందని చెబుతూ రాజ్యాంగం నిర్ధేశించిన 50శాతం పరిమితి మించకుండానే ఈ రిజర్వేషన్లు అమలు జరుగుతుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకున్న అపార అనుభవంతోఎవరికి నష్టం కలగని రీతిలో కాపులకు న్యాయం చేస్తారని ఆయన తెలిపారు.
రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారికి నష్టం కలగకుండా ప్రభుత్వం కాపురిజర్వేషన్లను అమలు చేస్తుందని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు నారాయణ చెప్పారు. సిఎం బాబు తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల కాపులకు న్యాయం కలుగుతుందని శ్రీకాకుళం ఎంపీ కింజరాపురామ్మోహన్నాయుడు చెప్పారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications