ఏటీఎం కార్డుల కలకలం: బస్తాల్లో తెచ్చి కుప్పలుగా పారబోశారు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కుప్పలుతెప్పలుగా ఏటీఎం కార్డులు పారబోశారు. అవన్నీ కూడా ఐసీఐసీఐ బ్యాంకుకు చెందినవిగా తెలుస్తోంది. కార్డుల పైన ఫోటోలు కూడా ఉన్నాయి.
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కుప్పలుతెప్పలుగా ఏటీఎం కార్డులు పారబోశారు. అవన్నీ కూడా ఐసీఐసీఐ బ్యాంకుకు చెందినవిగా తెలుస్తోంది. కార్డుల పైన ఫోటోలు కూడా ఉన్నాయి.
నెల్లూరులో రోడ్డు పక్కన వేలాది ఏటీఎం కార్డులు కుప్పలుగా పోశారు. కార్లలో వచ్చిన వారు మూడు బస్తాల్లో వీటిని పారబోశారని తెలుస్తోంది. అవన్నీ ఒకే రంగులో ఉన్నాయి. ఇది ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది.

నోట్ల రద్దు తర్వాత పెద్ద ఎత్తున బ్యాంకులలో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కార్డులు పడవేయడం అనుమానాలకు దారితీస్తోంది. వేలాది ఏటీఎం కార్డులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications