Tiger: వామ్మో పెద్దపులి ఎలా వచ్చిందో చూడండి. బయటకు రాకండి
అడవులకే పరిమితమవ్వాల్సిన పెద్దపులి (Tiger) క్రమంగా జనావాసాల వైపు కదులుతుండటంతో గ్రామస్థుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. పులి కదలికలపై స్పష్టత లేకపోవడంతో ప్రజలు రాత్రిళ్లు నిద్రాహారాలు మానుకుని అప్రమత్తంగా గడుపుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన చిడిపి, ఆరుకురేవుల గ్రామాల పరిసర పొలాల్లో పెద్దపులి పాదముద్రలను గ్రామస్థులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. రెండు రోజుల క్రితం తొర్రేడు ప్రాంతం చుట్టుపక్కల పెద్దపులి కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Tiger కదలికలపై నిఘా..
ఈ ఘటనల నేపథ్యంలో జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామస్తులు ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని, అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
ఇదే పెద్దపులి సీతానగరం మండలంలోని గోదావరి లంక ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు కూడా అడుగుజాడల ఆధారంగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. లంక గ్రామాల్లో పులి సంచారం వార్తలతో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. పశువుల మేతకు వెళ్లడానికీ, వ్యవసాయ పనులకు వెళ్లడానికీ గ్రామస్థులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
సీతానగరం నుంచి ప్రారంభమైన పెద్దపులి కదలికలు కోరుకొండ మండలం గాడాల ప్రాంతం వరకు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో తొర్రేడు వద్ద పశువులపై దాడి జరగడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి మరింతగా గ్రామాల వైపు వస్తుందా, లేక అటవీ ప్రాంతాల్లోకి మళ్లుతుందా అన్న సందిగ్ధత కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల మధ్య రాజమండ్రిలోని దివాన్ చెరువు ప్రాంతంలో కలకలం రేగింది. దివాన్ చెరువు ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ సమీపంలో పెద్దపులి సీసీ కెమెరాలకు చిక్కిన దృశ్యాలు బయటకు రావడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణ పరిధిలోకి కూడా పెద్దపులి చేరిందన్న వార్తలతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.
బయటకు రాకండి, రాత్రి వేళల్లో జాగ్రత్త..
అటవీ శాఖ అధికారులు గస్తీని పెంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు రాకుండా, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పులి దివాన్ చెరువు అడవుల్లోకి వెళ్లే అవకాశముందా, లేక రంపచోడవరం - మారేడుమిల్లి అటవీ ప్రాంతాల వైపు కదులుతుందా అన్న కోణంలో అధికారులు దృష్టి సారించారు.
పులి కదలికలపై స్పష్టత కోసం డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే పులి అడవుల్లోకి వెళ్తుందో, లేక జనావాసాలపై ముప్పుగా మారుతుందో తెలియక తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రజలు భయంతో అప్రమత్తంగా గడుపుతున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications