Tirupati: కోవిడ్ కేర్ సెంటర్లలో జేఈవో భార్గవి ఆకస్మిక తనిఖీలు, అవసరానికి మించి సిబ్బంది, ఆరా !

తిరుపతి: తిరుపతి నగరంలోని తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం తోపాటు తొండవాడ సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్లను టీటీడీ తిరుపతి జేఈవో శ్రీమతి సదా భార్గవి ఐఏఎస్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. తిరుపతిలోని పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం, తొండవాడ వద్ద ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ల లో చికిత్స పొందుతున్న రోగులకు అందించే ఆహారం తయారీకి అవసరమైన సరుకులు టీటీడీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలు, భోజనాల నాణ్యతను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించారు. కోవిడ్ కేర్ సెంటర్స్ స్టోర్స్ లో టీటీడీ నుంచి వచ్చిన సరుకుల రిజిస్టర్లను సదా భార్గవి పరిశీలించారు.
కోవిడ్ కేర్ సెంటర్లకు నెలవారీగా ఎన్ని సరుకులు వస్తున్నాయి, ఎన్ని ఉపయోగిస్తున్నారనే వివరాలను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించారు. అవసరానికి మించి సరుకులను నిల్వ ఉంచుకోరాదని టీటీడీ జేఈవో సదా భార్గవి అక్కడి సిబ్బందికి సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో అవసరానికి మించి సిబ్బంది ఉన్నారని టీటీడీ జేఈవో సదా భార్గవి గమనించారు.

కోవిడ్ కేర్ కు సరుకులు ఇస్తున్న టీటీడీ

కోవిడ్ కేర్ కు సరుకులు ఇస్తున్న టీటీడీ

తిరుపతి నగరంలోని తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం తోపాటు తొండవాడ సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్లను టీటీడీ తిరుపతి జేఈవో శ్రీమతి సదా భార్గవి ఐఏఎస్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. తిరుపతిలోని పద్మావతి నిలయం, శ్రీనివాసం, విష్ణునివాసం, తొండవాడ వద్ద ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ల లో చికిత్స పొందుతున్న రోగులకు అందించే ఆహారం తయారీకి అవసరమైన సరుకులు టీటీడీ అందిస్తున్న విషయం తెలిసిందే.

షాక్ ఇచ్చిన జేఈవో

షాక్ ఇచ్చిన జేఈవో

బుధవరాం టీటీడీ, తిరుపతి జేఈవో సదా భార్గవి ఆకస్మికంగా కోవిడ్ కేర్ సెంటర్లను పరిశీలించారు. ఈ నేపధ్యంలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలు, భోజనాల నాణ్యతను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించారు. కోవిడ్ కేర్ సెంటర్స్ స్టోర్స్ లో టీటీడీ నుంచి వచ్చిన సరుకుల రిజిస్టర్లను సదా భార్గవి పరిశీలించారు. కోవిడ్ కేర్ సెంటర్లకు నెలవారీగా ఎన్ని సరుకులు వస్తున్నాయి, ఎన్ని ఉపయోగిస్తున్నారనే వివరాలను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించారు.

నెలకు ఎంత సరుకు వస్తోంది ?, ఏం చేస్తున్నారు

నెలకు ఎంత సరుకు వస్తోంది ?, ఏం చేస్తున్నారు

ఈ సందర్భంగా జెఈవో సదా భార్గవి కోవిడ్ కేర్ సెంటర్స్ సిబ్బందితో మాట్లాడారు. కోవిడ్ కేర్ సెంటర్లకు నెలవారీగా ఎన్ని సరుకులు వస్తున్నాయి, ఎన్ని ఉపయోగిస్తున్నారనే వివరాలను టీటీడీ జేఈవో సదా భార్గవి పరిశీలించారు. అవసరానికి మించి సరుకులను నిల్వ ఉంచుకోరాదని టీటీడీ జేఈవో సదా భార్గవి అక్కడి సిబ్బందికి సూచించారు.

 తిరుపతి కోవిడ్ కేర్ సెంటర్లలో ఎంత మంది ఉన్నారంటే ?

తిరుపతి కోవిడ్ కేర్ సెంటర్లలో ఎంత మంది ఉన్నారంటే ?

పద్మావతి నిలయంలో 282 మంది, తొండవాడ దగ్గర ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ లో 131 మంది రోగులు ఉన్నారని టీటీడీ జేఈవో సదా భార్గవికి అక్కడి సంబంధిత అధికారులు వివరించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి
జెఈవో సదా బార్గవి అడిగి తెలుసుకున్నారు.

 కోవిడ్ కేర్ లో అవసరానికి మంచి సిబ్బంది

కోవిడ్ కేర్ లో అవసరానికి మంచి సిబ్బంది

కోవిడ్ కేర్ సెంటర్లలో అవసరానికి మించి సిబ్బంది ఉన్నారని టీటీడీ జేఈవో సదా భార్గవి గమనించారు. ఈ సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బంది, అన్నదానం సిబ్బందికి టీటీడీ జేఈవో సదా భార్గవి పలు సూచనలు చేశారు. క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, క్యాంటీన్స్ డిప్యూటీ ఈవో లక్ష్మణ్ నాయక్ , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్, డాక్టర్ భరత్ తో పాటు వైద్య విభాగం అధికారులు పాల్గొన్నారు.

 తిరుపతి కోవిడ్ కేర్ సెంటర్స్ లో కరోనాను జయించిన ప్రజలు

తిరుపతి కోవిడ్ కేర్ సెంటర్స్ లో కరోనాను జయించిన ప్రజలు

తిరుపతిలోని టీటీడీ వసతి గృహాలను కోవిడ్ కేర్ సెంటర్లగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో అక్కడికి అవసరం అయ్యే సరుకులు మొత్తం టీటీడీ అందిస్తోంది. ఇప్పటికే కొన్ని వేల మంది తిరుపతి కోవిడ్ కేర్ సెంటర్లలో వ్యాధి నయం చేసుకుని వారి ప్రాణాలు కాపాడుకున్నారు. చిత్తూరు జిల్లాతో చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఇక్కడి కోవిడ్ కేర్ సెంటర్లలో కరోనా వైరస్ కు చికిత్స చేయించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+