కృష్ణా జిల్లాలో తీవ్రవిషాదం.. నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు బాలురు మృతి
శ్రీరామనవమి పండుగ నాడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్ళిన ముగ్గురు బాలురు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. చనిపోయిన ముగ్గురు అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ విషాద ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమునీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పండుగ సందర్భంగా ఈరోజు ఉదయం మత్తి వెంకట గోపి కిరణ్(15), ఎం. వీరబాబు(15), ఎం.వర్ధన్(16) కృష్ణా నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ యువ కుమార్, ఎస్ఐ శ్రీనివాసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే కొంతసేపటికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ అనూహ్య ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుర కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. పండుగ పూట ఆనందంగా గడపాల్సిన చిన్నారుల ఇలా చనిపోవడం పట్ల దుఖంలో మునిగిపోయారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications