వీడని అలక: జగన్‌కు వైవి సుబ్బారెడ్డి కుంపటి?

YV Subba Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పెట్టిన కుంపటి ఆరలేదని వార్తలు వస్తున్నాయి. వైవి సుబ్బారెడ్డి అలక వీడలేదని అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి ఒంగోలు లోకసభ సీటును అశిస్తున్నారు. అయితే, జగన్ నుంచి ఆయనకు సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఆయన అలక వహించినట్లు చెబుతున్నారు.

జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ నెల 18వ తేదీన నిర్వహించిన పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశానికి వైవి సుబ్బారెడ్డి హాజరు కాలేదు. సుబ్బారెడ్డి ఆ సమయంలో విదేశాల్లో ఉన్నారని, ఈ రోజు ఆయన తిరిగి వస్తారని పార్టీ అప్పుడు వివరణ ఇచ్చింది.

సమావేశం తర్వాత రోజు జగన్ వైవి సుబ్బారెడ్డితో మాట్లాడారు. ఒక్క సీటుకే ఎందుకు పరిమితమవుతారని, పార్టీపరంగా ఎన్నికల నిర్వహణ బాధ్యతను చూడాల్సి ఉంటుంది కదా అని జగన్ ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారని వార్తలు వచ్చాయి. అయితే, వైవి సుబ్బారెడ్డి దాంతో సంతృప్తి చెందలేదని అంటున్నారు.

ఎప్పటి నుంచో తాను ఆశ పెట్టుకున్న ఒంగోలు లోకసభ టికెట్ వచ్చేలా కనిపించడం లేదని సుబ్బారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. దాంతో ఆయన ఇప్పటికీ పార్టీకి దూరంగానే ఉంటున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+