శ్రీవారి భక్తులకు బిగ్ షాక్... నేడు, రేపు ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) ముఖ్య ప్రకటన విడుదల చేసింది. మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో దర్శనాలు, టోకెన్ల జారీ, ఆర్జిత సేవలు, అన్నప్రసాద వితరణ వంటి అనేక సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ యాత్ర ప్రణాళికను సవరించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
SSD టోకెన్ల జారీపై స్పష్టత..
టీటీడీ ముందుగా ప్రకటించిన విధంగానే, మార్చి 2 మరియు 3 తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ (SSD) టోకెన్లు జారీ చేయబడవు. అలాగే, మార్చి 2, 3 తేదీలకు సంబంధించిన SSD టోకెన్లు ముందురోజులైన మార్చి 1, 2 తేదీలలో కూడా జారీ చేయబడవని మరోసారి స్పష్టం చేసింది. మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మాత్రం మార్చి 3న జారీ చేయనున్నారు.

మార్చి 3న ఆలయం మూత..
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయబడనుంది. చంద్రగ్రహణం సాయంత్రం 3.20 గంటలకు ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది. ఆనవాయితీ ప్రకారం గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయబడతాయి. సాయంత్రం 7.30 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి శుద్ధి, పుణ్యహవచనం వంటి కర్మలు నిర్వహించిన అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు దర్శనం పునఃప్రారంభమవుతుంది.
ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల రద్దు..
చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న నిర్వహించాల్సిన అష్టదళ పాదపద్మారాధన సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా నిలిపివేశారు. మార్చి 2న వీఐపీ దర్శన సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.
అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేత..
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నారు. తిరుచానూరులోని ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో ఉచిత అన్నప్రసాద పంపిణీ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. అయితే ప్రభుత్వ వైద్యశాలలు, ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు, వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
భక్తులకు సూచనలు..
గ్రహణ సమయాల్లో ఆలయాలు మూసివేయడం శాస్త్రోక్త పరంపరలో భాగమని టీటీడీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో భక్తులు దర్శనాల కోసం ముందస్తుగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది.
ఆన్లైన్ బుకింగ్, టోకెన్ల జారీ తేదీలు, సేవల రద్దు వివరాలను అధికారిక వెబ్సైట్ లేదా సమాచార కేంద్రాల ద్వారా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
చంద్రగ్రహణం కారణంగా మార్చి 2, 3 తేదీల్లో తిరుమలలో పలు సేవలు నిలిపివేయబడుతున్నాయి. దర్శనాలు, టోకెన్లు, అన్నప్రసాద వితరణలో మార్పులు ఉన్నందున భక్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలి.
టీటీడీకి సహకరించి ఏర్పాట్లు సజావుగా జరిగేలా చేయాలని అధికారులు కోరుతున్నారు.
-
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్











Click it and Unblock the Notifications