తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీవారు, చెన్నై గొడుగులతో పాదయాత్ర, నీరాజనం పట్టిన భక్తులు !

|
Google Oneindia TeluguNews

తిరుమల/తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్ర‌వారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రాజ‌మ‌న్నార్ అలంకారంలో క‌ల్ప‌వృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

Tirumala: సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీవారు, భక్త బృందాలు, కర్పూరహారతులు!Tirumala: సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీవారు, భక్త బృందాలు, కర్పూరహారతులు!

క‌ల్ప‌వృక్ష వాహనం ముందు గజరాజుల సందడి

క‌ల్ప‌వృక్ష వాహనం ముందు గజరాజుల సందడి

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

క‌ల్ప‌వృక్ష వాహ‌నం, ఐహిక ఫ‌లప్రాప్తి

క‌ల్ప‌వృక్ష వాహ‌నం, ఐహిక ఫ‌లప్రాప్తి

క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో క‌ల్ప‌వృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక క‌ల్ప‌వృక్షం కోరుకున్న‌ ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి క‌ల్ప‌వృక్ష‌ వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం శ్రీ‌వారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

శ్రీవారి కోసం చెన్నై గొడుగులు

శ్రీవారి కోసం చెన్నై గొడుగులు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా శుక్ర‌వారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు గొడుగులు

చెన్నై నుంచి ఊరేగింపుగా తిరుమలకు గొడుగులు


ఆల‌యం ముందు ఈ గొడుగుల‌ను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆర్‌.ఆర్‌.గోపాల్‌జీ మాట్లాడుతూ ఈనెల 25న చెన్నై నుంచి 11 గొడుగుల ఊరేగింపు ప్రారంభ‌మైంద‌న్నారు.

 17 ఏళ్ల నాటి చరిత్ర

17 ఏళ్ల నాటి చరిత్ర


చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తిరువళ్లూరులోని వీరరాఘవ పెరుమాళ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించామ‌న్నారు. గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2 గొడుగులను సమర్పించిన‌ట్టు చెప్పారు. గత 17 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవ నాడు అలంకరించడానికి శ్రీవారికి గొడుగులు స‌మ‌ర్పిస్తున్నామని ఆయన తెలిపారు.

English summary
Tirumala: Wearing Rajamudi (head gear), holding a Dandam, Sri Malayappa flanked by Sridevi and Bhudevi on either side, cheered His devotees on the majestic Rajamannar Alankaram on the fourth day morning on Friday on Kalpavriksha Vahanam in Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X