24తర్వాతే: మహా సంప్రోక్షణంపై టీటీడీ ఈవో, సోషల్ మీడియా విమర్శలపై అసంతృప్తి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగనున్న మహాసంప్రోక్షణంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మహా సంప్రోక్షణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఆరు రోజుల పాటు పూర్తిగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని అనిల్కుమార్ సింఘాల్ కోరారు. జులై 24న టీటీడీ బోర్డు సమావేశం ఉన్నందున అప్పటిలోగా భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా ఎక్కువ సంఖ్యలో వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు 3-4 గంటల పాటు రెండు విడతలుగా దర్శనం కల్పించాలా? అని యోచిస్తున్నట్లు తెలిపారు.
టీటీడీకి భక్తుల ప్రయోజనాలే ముఖ్యమని.. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది కలిగించేలా ఉంటే మార్చుకునేందుకు వెనుకాడబోమమని ఈవో తెలిపారు. భక్తుల అభిప్రాయాలను బట్టి 24న నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
-
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications