TTD: అక్కడ నుంచి శాశ్వత క్యూలైన్‌, భక్తుల దర్శన గడువు పెంపు..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న వేళ భక్తులు శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కమాండ్ కంట్రోల్ ద్వారా రద్దీని గమనిస్తూ.. అవసరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. మే నెలలో తిరుమలలో భక్తులు రికార్డు స్థాయిలో దర్శనాలు చేసుకున్నారు. ఇక, రద్దీని దృష్టిలో పెట్టుకొని దర్శనం కోసం శాశ్వత క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నారై భక్తుల దర్శన గడువు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బాటగంగమ్మ సర్కిల్‌ నుంచి గోగర్భం సర్కిల్‌ వరకు శాశ్వత క్యూలైన్‌ ఏర్పాటుకు టీటీడీ ప్రతిపాదించింది. ఇక్కడ క్యూలైన్‌ ఏర్పాటుతోపాటు స్టీల్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు టెండర్లు ఖరారు చేసింది. పర్వదినాలతోపాటు సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. బాటగంగమ్మ సర్కిల్‌ నుంచి గోగర్భం సర్కిల్‌ వరకు శాశ్వత క్యూలైన్‌ ఏర్పాటుకు, స్టీల్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు రూ.12 కోట్లు ఖర్చవుతుందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు టీటీడీ సాంకేతిక అనుమతులు మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా టెండర్లు ఆహ్వానించగా నాలుగు సంస్థలు ముందుకు వచ్చాయి. రూ.8,25,48,722.84కే పనులు పూర్తి చేసేందుకు తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేసింది.

నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ.? కీలక శాఖల మార్పులు- ఎవరికి ఏది..!!
నిర్మలా సీతారామన్ కు విద్యాశాఖ.? కీలక శాఖల మార్పులు- ఎవరికి ఏది..!!
ttd-latest-decisions-over-permanent-queue-line-for-devotees-in-tirumala-and-extends-darshan-time-fo

ఎన్నారై భక్తుల దర్శన గడువు పెంపు

అదే విధంగా ప్రస్తుతం ఉన్న విరాళాల వ్యవస్థను, దాని ద్వారా దాతలకు లభించే ప్రివిలేజె్‌సను హేతుబద్ధీకరించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. విరాళాల విధానంలో ఏకరూపత తీసుకొచ్చేందు కు టీటీడీ ట్రస్టులు, వివిధ పథకాల కోసం ఒక సమగ్ర నగదు విరాళాల విధానాన్ని రూపొందించా ల్సిన అవసరం ఉందని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఇక.. ప్రవాస భారతీయులకు శ్రీవారి దర్శనానికి 90 రోజుల గడువు విధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చిన భక్తులకు పాస్‌పోర్టు, వీసా ఆధారంగా టీటీడీ ప్రత్యేకంగా దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెలిసిందే. నిర్దిష్టమైన కాల పరిమితి లేకపోవడంతో ఎన్‌ఆర్‌ఐ భక్తుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో పాస్ట్‌పోర్టుపై స్టాంప్‌ పడిన 90 రోజుల్లోపు 'ఎన్‌ఆర్‌ఐ కోటా'లో దర్శనం చేసుకోవచ్చంటూ శుక్రవారం రాత్రి టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+