వర్షాకాలంలో తుని అందాలు.. తనివితీరా ఆస్వాదించేలా..
కాకినాడ జిల్లాలోని తుని ప్రాంతం అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇక్కడి ప్రకృతి రమణీయమైన అందాలు చూపరులను కట్టిపడేస్తాయి. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం పచ్చగా కళకళలాడుతూ పర్యటకులను ఆకర్షిస్తోంది. రోడ్లకు ఇరు వైపులా నిండు పచ్చదనం ఎత్తైన కొండలు, సెలయేర్లు, జలపాతాలు.. ఇలా ఒక్కటేమిటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అటవీ అందాలు వర్ణించాలంటే మాటలు రావు.
తుని సమీపంలోని కొన అడవులు పర్యాటకానికి ప్రసిద్ధి చెందాయి. ఇవి అడ్వెంచర్, ప్రకృతిని ఇష్టపడేవారికి ఒక ప్రసిద్ధ ప్రదేశంగా ఉంది. ఇక్కడ బీచ్ వ్యూ పాయింట్, పల్మన్ పేట బీచ్ వంటివి ఉన్నాయి. అలాగే ఈ ప్రాంతంలో కొన్ని బౌద్ధ, జైన పుణ్యక్షేత్రాలు కూడా కనువిందు చేస్తున్నాయి. తునిలో తలుపులమ్మ తల్లి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. తుని ప్రాంతానికి సమీపంలో, అందమైన పచ్చని కొండల మధ్య ఉన్న ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి నిత్యం వందలాది మంది పర్యటకులు వస్తుంటారు. తలుపులమ్మ తల్లి ఆలయం వైపు వెళ్లే మార్గంలో, ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని కొండ ప్రాంతాలు ఉంటాయి. తలుపులమ్మ తల్లి, లోవా టెంపుల్ గోదావరి సహజ సౌందర్యానికి ఒక నమూనాగా ఉన్న దిగువ లోయ ఉత్కంఠభరితమైన దృశ్యాల్ని అందిస్తుంది. చుట్టూ ఉన్న కొండలు, లోయల కారణంగా దేవాలయాల ప్రదేశం చాలా ప్రశాంతంగా అందమైన వాతావరణం కలిగి ఉంది.

తుని ప్రాంతంలో ముఖ్యంగా చూడాల్సినవి.. బీచ్ వ్యూ పాయింట్, పలమాన్ పేట బీచ్, వేమవరం బీచ్ వ్యూ పాయింట్, లోన్ హిల్స్ వ్యూ పాయింట్, పెంటకోట బీచ్, అద్దరిపేట బీచ్, బంగారయ్యపేట బీచ్, డీఎల్ పురమ్, దానవాయిపేట బీచ్, తదితర ప్రాంతాలు కనువిందు చేస్తాయి. తుని, పాయకరావుపేట మీదుగా తాండవ నది అందాలనూ వీక్షించవచ్చు.












Click it and Unblock the Notifications