తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమలో ఇద్దరమ్మాయిలు: పెళ్లి చేసుకుంటామంటూ తిరుపతికి!

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఒకరినొకరు వదిలి ఉండలేక, పెద్దలను ఎదురించలేక ఎటో వెళ్లిపోయారు.

అయితే, వారిద్దరూ అమ్మాయి అబ్బాయి కాదు.. ఇద్దరూ అమ్మాయిలే కావడం గమనార్హం. ఈ ఘటన అనంతపురం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.

ప్రేమలో పడిపోయారు

ప్రేమలో పడిపోయారు

అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు అనంతపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. ఇందులో ఒకరు సీనియర్ కాగా, మరొకరు జూనియర్. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకుంటామంటూ..

పెళ్లి చేసుకుంటామంటూ..

ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకునేందుకు తిరుపతికి వెళ్తున్నామని ఓ లేఖను రాసి వెళ్లిపోయారు. అంతేగాక, తమ కోసం వెతకొద్దని పేర్కొన్నారు.

 తల్లిదండ్రుల ఆందోలన

తల్లిదండ్రుల ఆందోలన

ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆందోళనకు గురైన యువతుల తల్లిదండ్రులు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చివరకు పట్టేశారు..

చివరకు పట్టేశారు..

ఆ యువతుల వద్ద సెల్‌ఫోన్ ఆధారంగా వారు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆదివారం తిరుపతికి చేరుకుని ఇద్దరమ్మాయిలను గుర్తించారు. ప్రస్తుతం వారిని వారి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు అనంతపురం తీసుకొచ్చారు.

English summary
Two girls fell in love in anantapur and eloped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X