రాళ్ల దాడి: పోలీస్ కాల్పుల్లో ఇద్దరు ఎర్ర కూలీలు మృతి
కడప: జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులు, తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఎర్ర చందనం కూలీలు మృతి చెందినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం.. ఓబులవారిపల్లె మండలం గాదెల అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో 100 మంది ఎర్రచందనం కూలీలు వారికి ఎదురుపడటంతో కూలీలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు.

అయితే రెచ్చిపోయిన కూలీలు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడటంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. దీంతో అక్కడ్నుంచి వంద మంది ఎర్ర చందనం కూలీలు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడితో పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేంద్రాలుగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications