స్నేహితుడ్నిచితకబాది ఒంటరి మహిళపై ఇద్దరి దారుణం
అదే వీధిలో ఉంటున్న ఇద్దరు యువకులు ఆమెపై కన్ను వేశారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారిని ఆపేందుకు యత్నించిన ఓ మిత్రుడిని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వయస్సు 28 వరకు ఉంటుంది. కాగా, స్నేహితుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం పడకల్ తండా వద్ద ఓ కారు లారీ కిందకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలానికి చెందిన వారిగా గుర్తించారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు వద్ద 16వ జాతీయ రహదారిపై ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలో రోడ్డు దాటుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.