శాకాంబరి అలంకరణలో మహంకాళి, పెద్దమ్మ(పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నుంచే పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి వడి బియ్యం, కానుకలు సమర్పించారు. వేలాది మంది భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడింది. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయంలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి శాకాంబరి దేవి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వందలాది కిలోల కూరగాయలతో అలంకరించారు. కాయగూరలతో వివిధ, జంతు, పక్షుల ఆకృతులను తయారు చేశారు.
అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేశారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అభిషేకం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం సామూహిక కుంకుమార్చనలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

శాకాంబరి అలంకరణలో..
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

భక్తులు
తెల్లవారుజామున నుంచే పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

క్యూలైన్లలో భక్తులు
అమ్మవారికి వడి బియ్యం, కానుకలు సమర్పించారు. వేలాది మంది భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడింది.

ఉజ్జయినీ మహంకాళి
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు శుక్రవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

పెద్దమ్మ తల్లి
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి శాకాంబరి దేవి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వందలాది కిలోల కూరగాయలతో అలంకరించారు.

భక్తులు
ఆలయంలో కాయగూరలతో వివిధ, జంతు, పక్షుల ఆకృతులను తయారు చేశారు.

మహిళా భక్తులు
ప్రత్యేక పూజల అనంతరం సామూహిక కుంకుమార్చనలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఆలయంలో అలంకరణ
అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేశారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక అభిషేకం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications