Vizag Steel: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు గుడ్ న్యూస్ చెప్పిన కుమారస్వామి..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంగీకరించిందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి దీన్ని సందర్శించారు. గత ఎన్డీయే సర్కార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెరతీసిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ప్రస్తుతం కేంద్రం మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో వాస్తవ పరిస్ధితులు తెలుసుకునేందుకు ఆయన ఇవాళ పర్యటిస్తున్నారు.
అయితే ఇవాళ ఉదయం విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి కుమారస్వామి.. సహాయ మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి ప్లాంట్ ను ఆద్యంతం పరిశీలించారు. అనంతరం స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ పేరెత్తకుండానే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆందోళన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ పై అనేక మంది ఆధారపడి ఉన్నారని కుమారస్వామి గుర్తుచేశారు. కాబట్టి దీన్ని రక్షించడం తమ బాధ్యతన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ ప్లాంట్ వంద శాతం సామర్ధ్యంతో తిరిగి ఉత్పత్తి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ಕೇಂದ್ರ ಸರಕಾರದ @SteelMinIndia ಅಧೀನದಲ್ಲಿರುವ ವಿಶಾಖಪಟ್ಟಣದ ವೈಜಾಗ್ ಸ್ಟೀಲ್ (Rashtriya Ispat Nigam-RINL) ಕಾರ್ಖಾನೆಗೆ ಖುದ್ದು ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಲಾಯಿತು.
— ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) July 11, 2024
ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಉನ್ನತ ಅಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ಇಡೀ ಕಾರ್ಖಾನೆಯ ವಿವಿಧ ವಿಭಾಗಗಳಿಗೆ ತೆರಳಿ ಮಾಹಿತಿ ಪಡೆಯಲಾಯಿತು ಮತ್ತು ಉತ್ಪಾದನಾ ಚಟುವಟಿಕೆಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಿ… pic.twitter.com/hNwRV3hAgx
మరోవైపు ప్లాంట్ సందర్శన అనంతరం కుమారస్వామి అక్కడి విజిటర్స్ డైరీలో తన అభిప్రాయం పంచుకున్నారు. "ఈ స్టీల్ ప్లాంట్ సందర్శించిన తరువాత నాకు ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధి కి సహాయపడుతుంది అని అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజు వారి అవసరాలు , జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత.
ఈ ప్లాంట్ మూతపడుతుంది అని మీరు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. ప్రధానమంత్రి గారి అశీసులు, సహాయం తో ఈ ప్లాంట్ 100% సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తుంది." అని తెలిపారు.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇప్పట్లో ముందుకెళ్లడం లేదని మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కుమారస్వామి కూడా ఆందోళన అవసరం లేదని చెప్పడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తగు సమయంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కార్మికులు, ఉద్యోగుల్లో భరోసా నింపేలా ఉన్నాయని చెప్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications