Araku Coffee Stall: పార్లమెంట్ లో అరకు కాఫీ ఘుమఘమలు- మోడీకి చంద్రబాబు థ్యాంక్స్..!
ఏపీ బ్రాండ్ అరకు కాఫీ ఘుమఘుమలు ఇకపై పార్లమెంట్ లోనూ ఎంపీలకు ఆహ్లాదాన్ని పంచబోతున్నాయి. అరకు లోయలో పండే కాఫీ రుచిని పార్లమెంట్ లో ఎంపీలకు పరిచయం చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ఏపీ ఎంపీల వినతిని లోక్ సభ స్పీకర్ తాజాగా అనుమతించారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో ఇవాళ రెండు స్టాల్స్ ను ప్రారంభించారు. కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్ తో పాటు ఏపీకి చెందిన ఎంపీలు, రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్లమెంట్లో ఇవాళ రెండు అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో లోక్సభ క్యాంటీన్లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అలాగే రాజ్యసభ క్యాంటీన్లో అరకు కాఫీ స్టాల్ ను వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అరకు లోయలో కాఫీ సువాసన పార్లమెంట్ లో గుబాళించబోతోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.

Aroma of Araku Valley in Parliament House!
— Piyush Goyal (@PiyushGoyal) March 24, 2025
Proudly inaugurated coffee stalls of the Andhra Pradesh Girijan Cooperative Corporation Ltd, promoting our tribal treasure, Araku Coffee.
Now, our parliamentarians can relish this local brew symbolising empowerment of our native people… pic.twitter.com/3x7hBOdc5C
మన గిరిజన సంపద అరకు కాఫీని ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కాఫీ స్టాళ్లను గర్వంగా ప్రారంభించారని, ఇప్పుడు, మన పార్లమెంటేరియన్లు మన స్థానిక ప్రజల సాధికారత, స్థిరమైన వ్యవసాయాన్ని సూచించే ఈ స్థానిక పానీయం రుచి చూడవచ్చని ఆయన తెలిపారు. ఇది బ్రాండ్ భారత్కు పెద్ద ప్రోత్సాహం అన్నారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.

Great news for coffee enthusiasts in the Parliament! You can now enjoy a freshly brewed cup of Araku Coffee right on the premises. My heartfelt thanks to the Hon’ble Prime Minister, Shri @narendramodi Ji, for championing Araku Coffee in ‘Mann Ki Baat’ and to Hon’ble Lok Sabha… pic.twitter.com/DiVPAvRwNV
— N Chandrababu Naidu (@ncbn) March 24, 2025
ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికీ, అంకితభావంతో ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణం, వారి అంకితభావం మరియు కృషి అరకు కాఫీని జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయికి తీసుకువచ్చింది. మనం ప్రతి కప్పును ఆస్వాదిస్తున్నప్పుడు, వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కూడా గుర్తుంచుకుందాం అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications