175 అన్స్టాపబుల్ - బావా బామ్మర్దిపై వైసీపీ కౌంటర్..!!
అమరావతి: టాలీవుడ్ టాప్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. తన కేరీర్లోనే మొదటిసారిగా హోస్ట్గా వ్యవహరిస్తోన్న టాక్ షో- అన్స్టాపబుల్. గత ఏడాది బుల్లితెరపై సందడి చేసిన ఈ షోకు కొద్దిరోజుల పాటు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ ఫ్రెష్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు చెందిన ఆహాలో ఈ టాక్ షో టెలికాస్ట్ కానుంది.
ఓటీటీలో..
ఈ నెల 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ఇది టెలికాస్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రీ ఫంక్షన్ను త్వరలో నిర్వహించడానికి యూనిట్ సన్నాహకాలు చేస్తోంది. ఓ బిగ్గెస్ట్ టాక్షోనకు అదే రేంజ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ఉండటం వల్ల దీనిపై అంచనాలు అమాంతం పెరిగాయి. అందులోనూ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్పై ఇది ప్రసారం కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చంద్రబాబు తొలి గెస్ట్..
తొలి ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గెస్ట్గా కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో చంద్రబాబు పాల్గొన్న షూటింగ్ను కొద్దిసేపటి కిందటే పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
చంద్రబాబు- బాలయ్య ఒకే ఫ్రేమ్లో..
బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడే అయినప్పటికీ- వారిద్దరూ కలుసుకోవడం చాలా అరుదు. పార్టీ కార్యక్రమాల్లో ఓ ఎమ్మెల్యేగా మాత్రమే బాలయ్య పాల్గొంటుంటారు. చంద్రబాబు వియ్యంకుడిగా లేక.. బావమరిదిగానో ఎప్పుడూ వ్యవహరించారు. నందమూరి లేదా నారా కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగితే తప్ప బంధువులుగా తరచూ కలుసుకోరు. అలాంటిది- చంద్రబాబు-బాలయ్య ఒకే ఫ్రేమ్లో కనిపించబోతోండటం పట్ల అభిమానుల ఆనందానికి హద్దులు ఉండట్లేదు.
మిక్స్డ్ టాక్..
చంద్రబాబు పాల్గొన్న ఈ ఎపిసోడ్పై సోషల్ మీడియాలో డివైడెడ్ టాక్ వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అభిమానులు భిన్నంగా స్పందిస్తోన్నారు. సెటైర్లు సంధించుకుంటోన్నారు. చంద్రబాబు-బాలయ్య ఒకే ఫ్రేమ్లో రాబోతోండటం పట్ల టీడీపీ, బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారీ ఎపిసోడ్ కోసం. అన్స్టాపబుల్ షో కోసం వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను వైరల్ చేస్తోన్నారు.
చంద్రబాబుపై ట్రోల్స్..
అదే సమయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు- చంద్రబాబుపై ట్రోల్స్ మొదలు పెట్టారు. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఆయన కూడా చంద్రబాబుపై విమర్శలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాకుండా బాలయ్య టాక్ షోలో చంద్రబాబు పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలో ఉన్నారు కాబట్టే