మద్దెలచెర్వు సూరి తెలియదు, భానుకిరణ్ను చూల్లేదు: వల్లభనేని వంశీ
తనకు మద్దెలచెర్వు సూరి ఎవరో తెలియదని, అలాగే భాను కిరణ్ను ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ మంగళవారం నాడు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు తెలిపారు.
హైదరాబాద్: తనకు మద్దెలచెర్వు సూరి ఎవరో తెలియదని, అలాగే భాను కిరణ్ను ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ మంగళవారం నాడు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు తెలిపారు.
సూరి గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. మీడియా వార్తల ఆధారంగానే భాను కిరణ్ గురించి తనకు తెలుసునని ఆయన చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సాక్షిగా హాజరు కావాలని కోర్టు ఆయనకు సమన్లు పంపింది.
ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సూరి, భాను కిరణ్ల గురించి చెప్పారు. కాగా, తన భర్త హత్యతో వంశీకి సంబంధం ఉందని గంగుల భానుమతి గతంలో ఆరోపించారు. తనకు కేసుతో సంబంధం లేదని ఆయన కొట్టిపారేశారు.
Comments
vallabhaneni vamsi bhanu kiran maddelacheruvu suri vijayawada nampally court వల్లభనేని వంశీ భాను కిరణ్ మద్దెలచెర్వు సూరి విజయవాడ నాంపల్లి కోర్టు
English summary
Telugudesam Party leader Vallabhaneni Vamsi says he don't know Suri and Bhanu Kiran.
Story first published: Tuesday, January 17, 2017, 19:08 [IST]