‘వందే భారత్’లో కూడా అలాగే చేస్తున్నారా?
భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందే భారత్’ రైళ్లలో పరిశుభ్రత లోపిస్తోంది. ప్రజలకు సౌకర్యవంతంగా మంచి ప్రయాణ అనుభూతిని కల్పించడానికి, తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకునే విధంగా వీటిని ప్రవేశపెట్టారు.
భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'వందే భారత్' రైళ్లలో పరిశుభ్రత లోపిస్తోంది. ప్రజలకు సౌకర్యవంతంగా మంచి ప్రయాణ అనుభూతిని కల్పించడానికి, తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకునే విధంగా వీటిని ప్రవేశపెట్టారు. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో ప్రయాణించే సమయంలో వాటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రయాణికులపై కూడా ఉంది. మంచినీళ్ల సీసాలు, పాలిథిన్ కవర్లు, ఆహార పదార్థాలు లాంటివి ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు. చెత్తా చెదారంతో నిండివున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీ ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో ఓ పారిశుధ్య కార్మికుడు వాటిని శుభ్రం చేస్తున్నారు. అవనిష్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి ఈ ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశారు.
దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడతారుకానీ, బాధ్యతలను మాత్రం మరిచిపోతారని ఒకరు కామెంట్ పెట్టారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంటే వాటిని ఎందుకు పరిశుభ్రంగా ఉంచరంటూ మరొక నెటిజన్ కామెంట్ పెట్టారు. దేశవ్యాప్తంగా 8 రూట్లలో వందే భారత రైళ్లు పరుగులు పెడుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య దీన్ని ప్రారంభించారు. భారత్ లో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడానికి గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. వందే భారత్ రైళ్లను మూడేళ్లలో తయారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పగా పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు నడుస్తున్న వందే భారత్ రైలు సికింద్రాబాద్ లో బయలుదేరి విశాఖపట్నం వచ్చేసరికి, విశాఖపట్నంలో బయలుదేరి సికింద్రాబాద్ వచ్చేసరికి చెత్తబుట్టలా మారుతోందని రైల్వే వర్గాలు తెలిపాయి. అప్పుడే ఒక కుర్చీ కూడా విరిగిపోయింది. టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. రైల్వే సిబ్బంది రైలును పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ ఆ బాధ్యత ప్రయాణికులపై కూడా ఉందని వాల్తేరు డీఆర్ఎం ఆవేదన వ్యక్తం చేశారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications