చంద్రబాబు ఫోటోలను మార్పింగ్ చేస్తూ అలా....శాంతిభద్రతలకు విఘాతమిలా....
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలను మార్పింగ్ చేస్తూ అసభ్యంగా ప్రచారం చేస్తోన్న వ్యక్తులపై ఆంద్రప్రదేశ్ హౌజింగ్ బోర్డు చైర్మెన్ వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడ: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలను మార్పింగ్ చేస్తూ అసభ్యంగా ప్రచారం చేస్తోన్న వ్యక్తులపై ఆంద్రప్రదేశ్ హౌజింగ్ బోర్డు చైర్మెన్ వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోను మార్పింగ్ చేసి ఆయనకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ తన ఫేస్ బుక్ ఖాతాలోకి వచ్చిందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ రకమైన పోస్టింగ్ లతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఆయన తన పిర్యాదులో చెప్పారు. విజయవాడ సంయుక్త పోలీస్ కమీషనర్ హరికుమార్ ను కలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలను మార్పింగ్ చేస్తూ అసభ్యంగా ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య చెప్పారు. ఈ మేరకు ఫేక్ పోస్టింగ్ లకు సంబందించిన సమాచారాన్ని పోలీసులకు ఆయన అందజేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.