ప్రజలను మర్చిపోయారు: మంత్రులపై వాసిరెడ్డి ధ్వజం

Vasireddy Padma
హైదరాబాద్: సీమాంధ్ర కేంద్రమంత్రులు రాష్ట్ర సమైక్యతను కోరకుండా.. రాష్ట్ర విభజన బిల్లుకు సవరణలు ప్రతిపాదించడం ఏంటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర మంత్రుల ద్వంద్వ వైఖరి తమకు అర్థమవుతోందని చెప్పారు.

సీమాంధ్ర మంత్రులు రాష్ట్ర సమైక్యతను ఎందుకు కోరుకోవడం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను జరగనివ్వమంటూ గతంలో ప్రగల్భాలు పలికిన కేంద్రమంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం కేంద్రమంత్రులకు లేదా అని ఆమె ప్రశ్నించారు.

జిఓఎంకు సవరణలు ఇవ్వడం అవమానకరమని వాసిరెడ్డి మండిపడ్డారు. తెలుగు ప్రజలు కత్తి పడుతుంటే.. ఎంపీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం లాబీయింగ్ చేయడం దురదృష్టకరమని అన్నారు. కేంద్రంలో వారు లాలూచీ పడకపోతే విభజనను ప్రశ్నించేవారని చెప్పారు. ప్రజల ప్రయోజనాలను వారు మరిచిపోయారని ఆరోపించారు.

తమ పార్టీ మద్దతుతోనే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేశానని ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అవాస్తవమని ఆమె అన్నారు. తాము రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ నుంచే దూరంగా ఉంటామని ముందే చెప్పామని వాసిరెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+