జయ మృతి-హైకోర్టు వ్యాఖ్య: డాక్టర్లను నమ్ముతున్నామన్న వెంకయ్య
జయలలిత మృతి పైన మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు స్పందించారు. తాను కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన మాట్లాడనని స్పష్టం చేశారు.
హైదరాబాద్: జయలలిత మృతి పైన మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు స్పందించారు. తాను కోర్టు పరిధిలో ఉన్న అంశం పైన మాట్లాడనని స్పష్టం చేశారు.
హైకోర్టు నోటీసులు ఇస్తే సమాధానం ఇస్తామన్నారు. జయలలిత మృతి విషయంలో తాము డాక్టర్లు చెప్పిన వివరాలను నమ్ముతున్నామని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు.

కాగా, జయ మృతిపై మద్రాస్ హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జయ మృతిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ రోజు విచారణ చేపట్టింది.
జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఆమెకు సంబంధించి ఒక్క ఫొటో కూడా విడుదల చేయలేదని, ఏ సమయంలో మృతిచెందారన్న సమాచారం కూడా సరిగా వెల్లడించలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తోసిపుచ్చలేమన్నారు.
జయలలిత మృతిపై తనకూ అనుమానాలున్నాయని, అయితే అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు. సీఎం ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉంటుందని, దానిని ఎందుకు గుర్తించలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఒక దశలో ఆయన జయలలిత దేహాన్ని సమాధి నుంచి తీసి ఎందుకు పరీక్షించరాదని అడిగారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications