వివాదం ముగిసింది: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామి
కడప: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతోపాటు కొందరు మండల స్థాయి నాయకులు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబసభ్యుల మధ్య జరిపిన చర్చలు ఫలించాయి.
బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని ఎంపిక చేశారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు.

శుక్రవారం ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో జరిపిన చర్చల్లో అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. కందిమల్లయ్యపల్లి సంస్థానంపుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక జరిగింది. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు. త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
కాగా, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి శనివారం దేవాదాయ శాఖ సంయుక్త ప్రాంతీయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ రానున్నారు. మఠం ఆచారాలు, ప్రస్తుత పరిస్థితులు, కందిమల్లాయపల్లె గ్రామ ప్రజల అబిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రికి దీనిపై నివేదిక ఇవ్వనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications