టీడీపీ నేతలు పార్టీలు మారినా తప్పించుకోలేదు: విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్
అమరావతి : ఏపీలో టీడీపీని నేతలను నీడలా వెంటాడుతామని సంకేతాలిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్. అందుకోసమే అవినీతి రహిత పాలన కోసం జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో చంద్రబాబు, ఆయన కోటరి వెన్నులో వణుకు మొదలైందని ఆరోపించారు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ప్రభుత్వం తీసుకునే చర్యలతో .. టీడీపీ నేతలు గజగజ భయపడిపోతున్నారని పేర్కొన్నారు.
రైతులను పట్టించుకోలేదు.
కౌలు రైతులను చంద్రబాబు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలపై ఆదివారం ట్వీట్టర్లో విమర్శించారు. కానీ జగన్ కౌలు రైతుల కోసం రైతు భరోసాతు అన్ని పథకాలు వర్తించేలా 15.30 లక్షల మందికి మేలు చేకూర్చే నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. అంతేకాదు అవినీతిపై సీఎం జగన్ జుడీషియల్ కమిషన్, రివర్స్ టెండరింగ్, విద్యుత్ పీపీఏలపై సమీక్షించడంతో .. చంద్రబాబు, ఆయన కోటరి వణికిపోతుందని తెలిపారు. అంతేకాదు తమ హయాంలో రూపాయి అవినీతి జరగలేదని బీరాలు పోయే నాయకులు .. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దీంతో కొందరు పార్టీ మారాలని కూడా నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. అయితే వారు పార్టీ మారినా, పార్టీలో ఉన్న .. అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.

దీనినిబట్టి గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిని విడిచిపెట్టరని అర్థమవుతుంది. ప్రభుత్వం తీసుకునే చర్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ తమ పారదర్శకతను చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది జగన్ సర్కార్. దీంతో ఏ చిన్న అవినీతికి పాల్పడిన తాట తీస్తామని తమ చేతలతో ప్రభుత్వం స్పష్టంచేస్తోంది. అయితే దీనికి విపక్ష టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications