వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఇష్యూలో నాపై 13 కేసులు, ఆస్తులు రూ.17 కోట్లు: విజయసాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన విజయ సాయి రెడ్డి మంగళవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన అఫిడవిట్లో తన పైన ఉన్న కేసులు, ఆస్తులను ప్రస్తావించారు. విజయ సాయి రెడ్డి రాజ్యసభకు వెళ్తే.. వైసిపి నుంచి రాజ్యసభకు వెళ్లిన తొలి వ్యక్తి అవుతారు.

విజయ సాయి రెడ్డి అఫిడవిట్లో తన ఆస్తులతో పాటు తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థిగా ఆయన సోమవారం నాటికి మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. మంగళవారం తన సతీమణి సునందారెడ్డితో ఓ డమ్మీ నామినేషన్ కూడా వేయించారు.

Vijaya Sai Reddy

ఈ క్రమంలో నామినేషన్‌తో పాటు తన ఆస్తులు, తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ అందజేశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ పైన నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో భాగంగా తనపై మొత్తం 13 కేసులు నమోదయ్యాయని అఫిడవిట్లో పేర్కొన్నారు.

తనకు, తన భార్య, కుటుంబ సభ్యులకు మొత్తం రూ.17.21 కోట్ల మేర ఆస్తులున్నాయని ప్రస్తావించారు. తనతో పాటు తన భార్య కూడా వ్యక్తిగతంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, టిడిపి నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపనందున ఏపీలో కూడా అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు.

English summary
YSR Congress Party leader Vijaya Sai Reddy Files nomination For Rajya Sabha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X