YSRCP Manifesto: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పేసిన విజయసాయిరెడ్డి..!
ఏపీలో గత ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టో హామీల్ని దాదాపుగా అమలు చేసేసిన వైసీపీ.. ఇప్పుడు మరోసారి ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. రేపు ఇడుపులపాయలో సీఎం వైఎస్ జగన్ వైసీపీ మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఇందులో పలు ప్రజాకర్షక హామీలు ఉండబోతున్నాయి. అయితే వీటిపై వైసీపీ పూర్తిగా మౌనం వహిస్తోంది. వీటిని ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీ సాయిరెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
రేపు వైసీపీ విడుదల చేయబోతున్న ఎన్నికల మ్యానిఫెస్టోలో పెన్షన్ల పెంపు, డ్వాక్రా రుణమాఫీ సహా పలు హామీలు ఉండబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అలాగే మహిళల కోసం మరికొన్ని కొత్త పథకాలు ఉంటాయన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉండబోతోందో విజయసాయిరెడ్డి ఒక్క ముక్కలో తేల్చిచెప్పేశారు. గతంలో తాము ఇచ్చిన మ్యానిఫస్టోతో పాటు టీడీపీ మ్యానిఫెస్టోనూ దీంతో ఆయన పోల్చారు.

న్నికల తర్వాత తమ మేనిఫెస్టోలను చెత్తబుట్టలో పడేసే టీడీపీ లాగా వైసీపీ మ్యానిఫెస్టో ఎన్నికల జిమ్మిక్కు కాదని విజయసాయిరెడ్డి ఎక్స్ లో చేసిన పోస్టులో తెలిపారు. వైసీపీ మ్యానిఫెస్టో తమ నిబద్ధత అని, తమ హామీ అని తెలిపారు. ఏపీ ప్రజల కోసం తమ ముందున్న కర్తవ్యమన్నారు. అలాగే తాము ఏం వాగ్దానం చేస్తున్నామో అదే ఇస్తామని కూడా సాయిరెడ్డి తన ట్వీట్ లో వెల్లడించారు. అయితే ఎన్నికల హామీల్ని మాత్రం ఆయన లీక్ చేయలేదు.













Click it and Unblock the Notifications