జగన్ కు సాయిరెడ్డి షాకింగ్ పంచ్ ..! వెనెజులా అధ్యక్షుడితో పోలుస్తూ..!
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రస్ధానం ప్రారంభించకముందు నుంచే వైఎస్ కుటుంబానికి ఆత్మీయుడిగా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి.. ఆ పార్టీ పాలనలో ఉన్న ఐదేళ్లలో ఎన్నో పదవులు కూడా అనుభవించారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న విజయసాయిరెడ్డి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కొన్నాళ్లకే రాజకీయాలకు, ఎంపీ పదవికీ, పార్టీకి గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద మాత్రం సాయిరెడ్డి పంచ్ లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదే క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డి ఎక్కడా జగన్ పేరెత్తకుండానే ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆయన గతంలో విమర్శలు గుప్పించిన కోటరీని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి ఈ పోస్టు చేశారని ఇట్టే అర్థమవుతోంది. అదే సమయంలో జగన్ ను ఆయన తాజాగా అమెరికా బందీగా చేసుకున్న వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రస్తావన కూడా తెచ్చారు. జగన్ కళ్లు తెరవకపోతే మదురో గతే పడుతుందనే అర్దం వచ్చేలా సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు.

అమ్ముడు పోయిన “కోటరీల” మధ్య “బందీలుగా” ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి!
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 18, 2026
వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్ళు, యుద్ధ…
ఇందులో సాయిరెడ్డి.. అమ్ముడు పోయిన "కోటరీల" మధ్య "బందీలుగా" ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి! వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా, మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ పేలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? "వారంతా అమ్ముడు పోవటమే కదా" !" అని తెలిపారు.












Click it and Unblock the Notifications