జగన్ పై దాడి కేసులో పురోగతి-పోలీసుల అదుపులో 10 మంది-అప్ డేట్ ఇదే..!
ఏపీలో గత వారం కలకలం రేపిన సీఎం జగన్ పై రాయి దాడి కేసులో క్రమంగా పురోగతి లభిస్తోంది. ఈ కేసులో జగన్ పై రాయి విసిరిన ఘటనకు కారకులుగా భావిస్తున్న 10 మంది అనుమానితుల్ని సెంట్రల్ నియోజకవర్గంలోని వడ్డెర కాలనీ నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ వన్ టౌన్ లోని సీసీఎస్ లో వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే వీరిలో ఓ అనుమానితుడిని సీఎం జగన్ తో పాటు దాడికి గురైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు చూపించారు.
వడ్డెర కాలనీకి చెందిన యువకులే సీఎం జగన్ పై రాయి విసిరినట్లు విజయవాడ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కోణంలోనే ఇప్పుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఎయిర్ గన్ తో పెల్లెట్ ప్రయోగించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసినా పోలీసులు మాత్రం రాయి దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. దీంతో రాయిదాడి చేసే అవకాశం ఉన్న స్ధానికుల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం పోలీసులకు సమస్యగా మారుతోంది.

జగన్ పై దాడి సమయంలో సీసీ ఫుటేజ్ తో పాటు ఫోన్ కాల్స్ రికార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నప్పటికీ ఇందులో ఎక్కడా క్లారిటీ రావడం లేదు. దీంతో పోలీసులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పది మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుున్నారు. వీరి నుంచి ఏదైనా క్లూ దొరికితే సరి లేకపోతే రూటు మార్చి అరెస్టులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటాను పిలిపించి సీఈవో వివరణ తీసుకున్నారు. దీన్ని ఈసీకి నివేదించబోతున్నారు.
-
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
మరో మూడు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications