విజయవాడ స్టేషన్ కు అదిరిపోయే ఫీచర్- దేశంలోనే తొలిసారి-రైల్వేమంత్రి ట్వీట్

దేశంలోని అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే తొలిసారిగా ఈ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామా్ లపై సౌరశక్తితో కూడిన కాంతిపీడన కవర్ ను ఏర్పాటు చేశారు. దీంతో రైల్వే స్టేషన్ కు అవసరమైన విద్యుత్ ను ఈ సౌరశక్తి ప్యానెళ్ల ద్వారానే పొందే అవకాశం లభించింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ ట్వీట్ చేశారు.

విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ లపై ఏర్పాటు చేసిన సౌరశక్తి కవర్ ద్వారా ఏడాదికి 8 లక్షల రూపాయలకు పైగా కరెంటు బిల్లు ఆదా కానుంది. అంతే కాకుండా స్టేషన్లోని 18 శాతం విద్యుత్ అవసరాలు తీరబోతున్నాయి. అదే సమయంలో కార్బన్ ఉద్గారాల ఉత్పత్తి కూడా తగ్గడం ద్వారా పర్యావరణ సహిత స్టేషన్ గా మారబోతోంది. ఈ కవర్ కింద ఉండే ప్రయాణికులకు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేద తీరేందుకు వీలు కలగబోతోంది. ఈ విషయాల్ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్వీట్ లో వివరించారు.

vijayawada station become first in india with innovative solar photovoltaic cover-over-platform

విజయవాడ స్టేషన్ దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన రైల్వే జంక్షన్లలో ఒకటైనా సదుపాయాల విషయంలో మాత్రం రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉండేవి. కానీ కొన్నేళ్లుగా రైల్వేశాఖ ఈ స్టేషన్ పై ప్రత్యేక దృష్టిసారించి సౌకర్యాలను అభివృద్ది చేస్తోంది. అదే సమయంలో ప్రైవేటీకరణ కోసం వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్లాట్ ఫామ్స్ పై సోలార్ కవర్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణ జరిగినా, జరగకపోయినా స్టేషన్ విద్యుత్ అవసరాలు తీర్చేందుకు, పర్యావరణ సహితంగా మార్చేందుకు ఈ సోలార్ కవర్ ఉపయోగపడబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+